charan: 'రంగస్థలం'లో పృథ్వీ కామెడీ ట్రాక్ లేపేశారా?

  • ఆకట్టుకుంటోన్న 'రంగస్థలం'
  • ఆశ్చర్యపరుస్తోన్న వసూళ్లు 
  • ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఫిల్మ్ నగర్ టాక్       

'రంగస్థలం' సినిమాకి అన్ని ప్రాంతాలనుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఏ ప్రాంతంలో చూసినా ఈ సినిమా ఆశ్చర్యచకితులను చేసే వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఆడియన్స్ బోర్ ఫీలవ్వడం లేదనే టాక్ వినిపిస్తోంది. విడుదలకి ముందు ఈ సినిమా నిడివి ఇంతకన్నా ఎక్కువగా ఉందట.

అయితే ఇంత నిడివి అయితే కష్టమని భావించి సుకుమార్ కొన్ని సీన్స్ ను తొలగించాడని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఆ సీన్స్ పృథ్వీ కి సంబంధించినవనేది తాజా సమాచారం. ఈ సినిమా సెకండాఫ్ లో డ్రామాతో సంబంధం లేకుండా పృథ్వీ .. చరణ్ కాంబినేషన్లో చిన్నపాటి కామెడీ ట్రాక్ ను చిత్రీకరించారట. ఈ కామెడీ ట్రాక్ కారణంగా నిడివి మరింతగా పెరిగిపోవడమే కాకుండా .. ప్రధానమైన కథకు అడ్డుపడుతోందని భావించి లేపేశారని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

  • Loading...

More Telugu News