Mahesh Babu: ఏప్రిల్ 7న ‘భరత్’ బహిరంగ సభ : హీరో మహేశ్ బాబు

  • హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భరత్ బహిరంగ సభ
  • ఈ వేడుకకు అందరూ హాజరవుతారని భావిస్తున్నా
  • ఓ ట్వీట్ చేసిన హీరో మహేశ్ బాబు

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘భరత్ అనే నేను’ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, ఫస్ట్ ఓత్, పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకను చిత్రయూనిట్ నిర్వహించనుంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

ఏప్రిల్ 7న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భరత్ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటిస్తున్నామని, ఈ వేడుకకు అందరూ హాజరవుతారని భావిస్తున్నట్టు ఆ ట్వీట్ లో మహేశ్ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ తో పాటు ‘భరత్ అనే నేను’ పోస్టర్ ను మహేశ్ పోస్ట్ చేశాడు. కాగా, ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకను ‘బహిరంగ సభ’గా అభివర్ణించడం ఆసక్తిదాయకం. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు అతిథులుగా విచ్చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News