balakrishna: వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ బయోపిక్ లాంచ్

  • ఎన్టీఆర్ బయోపిక్ కి సన్నాహాలు 
  • ఈ నెల 29న ఉదయం 9.42కి లాంచ్ 
  • రామకృష్ణ స్టూడియోస్ లో కార్యక్రమం

ఎన్టీఆర్ బయోపిక్ ను లాంచ్ చేసే సమయం కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం చెప్పారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరు కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఈ నెల 29వ తేదీన ఉదయం 9.42 నిమిషాలకి ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. హైదరాబాద్ - నాచారం .. రామకృష్ణ స్టూడియోస్ లో ఈ కార్యక్రమం జరగనుంది. బాలకృష్ణ తన తండ్రి సొంత ఊరు 'నిమ్మకూరు' నుంచి .. తల్లి సొంత ఊరు 'కొమరవోలు' నుంచి అభిమానులను ఆహ్వానించినట్టు సమాచారం. 29వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేసి .. ద్వితీయ విఘ్నం లేకుండగా ఆ మరునాడు షూటింగ్ చేస్తారట. ఆ తరువాత కొన్ని రోజులకు రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని అంటున్నారు.     

  • Loading...

More Telugu News