Vijay Sai Reddy: విజయసాయిరెడ్డి చాలా తప్పుడు భాష వాడారు : సుజనా చౌదరి

  • చంద్రబాబునాయుడుపై మాట్లాడిన తీరు చాలా బాధాకరం
  • సభ్య సమాజం తలదించుకునేలా ఆయన మాట్లాడారు
  • మీడియా ద్వారా విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలి 
  • ఢిల్లీలో విలేకరుల సమావేశంలో సుజనా చౌదరి

తమ నాయకుడు చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయోగించిన పదజాలం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేలా మాట్లాడారు. విజయసాయిరెడ్డి కూడా చదువుకున్నాయన.. చార్టెడ్ అకౌంటెంట్. రాజకీయంగా విభేదాలుండొచ్చు కానీ, చంద్రబాబునాయుడు గురించి ఆయన మాట్లాడిన తీరు చాలా బాధాకరంగా ఉంది. యావత్తు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు ప్రజలు తలదించుకునేలా ఉంది.

అసలు, భావి తరాలకు అసలు ఏం తెలియపరుస్తున్నారు? ఆయనకీ భార్యాపిల్లలు ఉన్నారు కదా, వాళ్లు వినే విధంగానే ఆయన మాట్లాడారా? ఈ విధంగా ఉంటే రాజకీయాలకు ఎక్కడికెళుతున్నాయనే విషయాన్ని మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.  భారతదేశంలో ఎన్ని రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, పార్లమెంట్ లోకి ఎవరైనా అడుగుపెట్టొచ్చు కానీ, పార్లమెంట్ పరువు తీసేలా వ్యవహరించకూడదు. విజయసాయిరెడ్డి చాలా తప్పుడు భాష వాడారు. ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని, మీడియా ద్వారా విజయసాయిరెడ్డి క్షమాపణ చెబితే మంచిది’ అని సుజనా చౌదరి హితవు పలికారు.

  • Loading...

More Telugu News