Vijay Sai Reddy: మోదీ కాళ్లు మొక్కారంటూ ఆరోపణలు.. వీడియో ఫుటేజీని బయటపెట్టాలంటూ సెక్రటరీ జనరల్ కు విజయసాయిరెడ్డి లేఖ!

  • వీడియో ఫుటేజీ బయటపెట్టాలంటూ లేఖ
  • హాట్ టాపిక్ గా మారిన విజయసాయి వ్యవహారం
  • మోదీ కాళ్లు మొక్కి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారంటూ విమర్శలు

ఈ ఉదయం రాజ్యసభ 15 నిమిషాలపాటు వాయిదా పడిన సమయంలో... సభలో ఉన్న నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి, ఆయన కాళ్లకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మొక్కారంటూ వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డితో పాటు వైసీపీపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. మోదీ కాళ్లు మొక్కి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారంటూ విమర్శిస్తున్నారు. ఈ వార్తలను ఇప్పటికే విజయసాయి ఖండించారు. మోదీకి తాను నమస్కరించానే తప్ప, కాళ్లు మొక్కలేదని చెప్పుకొచ్చారు. తాజాగా పార్లమెంటు సెక్రటరీ జనరల్ కు ఆయన లేఖ రాశారు. వీడియో ఫుటేజీని బయటపెట్టాలని ఆ లేఖలో ఆయన కోరారు.  

  • Loading...

More Telugu News