Tollywood: ‘రంగస్థలం’కు ‘యూ/ఎ’ సర్టిఫికెట్

  • ‘రంగస్థలం’కు యూ/ఎ సర్టిఫికెట్ మంజూరు చేసిన సెన్సార్ బోర్డు
  • ఓ పోస్ట్ లో పేర్కొన్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ  
  • ప్రపంచ వ్యాప్తంగా 30న విడుదల కానున్న ‘రంగస్థలం’ 

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘రంగస్థలం’ చిత్రం ఈరోజు సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి  సెన్సార్  బోర్డు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్టు చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ విషయాన్ని పేర్కొంది ఓ పోస్ట్ లో తెలిపింది. కాగా, ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా ‘రంగస్థలం’ విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో విలక్షణ పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది. ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి  దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

  • Loading...

More Telugu News