MS Dhoni: వేదికపై ధోనీ కాళ్లకు పదే పదే నమస్కరించిన కుర్రాడు!

  • ధోనీ చేతుల మీదుగా బహుమతి అందుకున్న కుర్రాడు
  • సంతోషంతో పొంగిపోయిన అభిమాని 
  • అభిమాన క్రికెటర్ తో సెల్ఫీ 

వేదికపై ఓ అభిమాని టీమిండియా స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోనీ కాళ్లను మొక్కిన ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. తాజాగా ధోనీ ఓ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వెళ్లి విజేతలకు బహుమతులు అందిస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ కుర్రాడు బహుమతి అందుకోవడానికి వేదికపైకి వస్తూనే ధోనీ కాళ్లకు నమస్కారం చేశాడు.

అనంతరం అతడిని పైకి లేపి ధోనీ బహుమతి అందించాడు. ఆ తర్వాత కూడా వేదిక దిగే సమయంలో ఆ కుర్రాడు మళ్లీ ధోనీ కాళ్లకు మొక్కాడు. ధోనీ తన సంతకం చేసిన బ్యాట్ ని అతడికి ఇచ్చాడు. ఆ కుర్రాడు ధోనీతో సెల్ఫీ కూడా దిగాడు. పదే పదే ఆ కుర్రాడు ధోనీ కాళ్లపై పడుతుండగా అతడిని త్వరగా వేదిక దిగాలని నిర్వాహకులు సూచించారు. ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, రెండేళ్ల నిషేధం తరువాత ధోనీ మళ్లీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ సారథిగా ఆడనున్నాడు.    

  • Loading...

More Telugu News