Telugudesam: ఆయన రంగంలోకి దిగారు..మోదీ మెడలు వంచుతాం : వర్ల రామయ్య

  • చంద్రబాబు రంగంలోకి రాకముందే ఎవరి వేషాలైనా!
  • వార్ డిక్లేర్ అయిపోయింది
  • వైసీపీ అవిశ్వాస తీర్మానం ‘తూతూ మంత్రం’: టీడీపీ నేత వర్ల  

ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని మోదీ మెడలు వంచుతామని టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘టీవీ 9’ చర్చా కార్యక్రమంలో వర్ల రామయ్య మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు గారు రంగంలోకి రాకముందే ఎవరి వేషాలైనా! ఆయన రంగంలోకి దిగారు..మోదీ గారి మెడలు వంచుతాం’ అని దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపైనా ఆయన విమర్శలు గుప్పించారు. కొన్ని రోజులుగా జగన్ తన పాదయాత్రలో గానీ, విలేకరులతో గానీ మోదీకి వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవని అన్నారు. ‘మోదీ చేసింది తప్పు, నీ సంగతి చూస్తాం’ అని జగన్ ఎప్పుడైనా అన్నారా? అని ప్రశ్నించారు.‘కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతాము కానీ మీకు దండం పెడతాం’, ‘నన్ను జైలుకు పంపొద్దు..మీకు (మోదీ) దండం పెడతా’ అని జగన్ మాట్లాడుతున్నారని, వైసీపీ అవిశ్వాస తీర్మానం ‘తూతూ మంత్రం’ అని విమర్శించారు. ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చిందో, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టామో, అప్పుడే వార్ డిక్లేర్ అయిపోయిందని వర్ల రామయ్య అన్నారు.

  • Loading...

More Telugu News