poti sriramulu: పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన రఘువీరారెడ్డి

  • ఈరోజు పొట్టిశ్రీరాములు జయంతి  
  • త్యాగధనుడు పొట్టిశ్రీరాములు .. ఆయన త్యాగాన్ని మరువలేం
  • ఢిల్లీలోని ఏపీసీసీ ఆధ్వర్యంలో నివాళులర్పించిన నేతలు

నాడు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నివాళులర్పించారు. ఈరోజు పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఏపీసీసీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షతో నాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆయన త్యాగాన్ని మరువలేమని అన్నారు. నాడు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన త్యాగధనుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. 

  • Loading...

More Telugu News