Pawan Kalyan: నాలుగేళ్లుగా విమర్శించని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌సారిగా ఇప్పుడు చేయ‌డం ఏంటి?: చ‌ంద్రబాబు

  • అవినీతి ఉండ‌కూడ‌ద‌ని నేను కృషి చేస్తోంటే మ‌రోవైపు ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు
  • మ‌నం ఓటర్లకు ఎందుకు డ‌బ్బులివ్వాలి?
  • మ‌నం చేసే ప‌ని చూసే ప్ర‌జ‌లు ఓట్లేస్తారు
  • నేను మూడు మాట‌ల్లో ఆరు అస‌త్యాలు మాట్లాడ‌తాన‌ని కూడా ప‌వ‌న్ అన్నారు

ఎన్నిక‌ల కోసం తాను ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి రూ.25 కోట్ల చొప్పున‌ పంపానని పవన్ కల్యాణ్ ఆరోపిస్తున్నారని, తాను ఎక్క‌డా అవినీతి ఉండ‌కూడ‌ద‌ని కృషి చేస్తోంటే మ‌రోవైపు త‌న‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయ‌న శాస‌న‌మండ‌లిలో మాట్లాడుతూ... మ‌నం ఎందుకు ఓట‌ర్ల‌కి డ‌బ్బులు ఇవ్వాలని, మ‌నం చేసే ప‌ని చూసే ప్ర‌జ‌లు ఓట్లేస్తారని వ్యాఖ్యానించారు. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఉండాల‌ని, పెద్ద నోట్లు ఉండ‌కూడ‌ద‌ని తాను కేంద్ర ప్ర‌భుత్వానికి గ‌తంలో విజ్ఞ‌ప్తి చేశాన‌ని అన్నారు.

త‌న‌ భార్య ప్ర‌తిరోజు క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్నారని, త‌మ‌ కుటుంబం ఎప్ప‌టిక‌ప్పుడు ఆస్తులను ప్ర‌క‌టిస్తోందని, నీతిమంతంగా డ‌బ్బులు సంపాదించుకుంటే మ‌న‌కు ఎప్ప‌టికీ గౌర‌వం ఉంటుందని చంద్రబాబు అన్నారు. త‌నపై చాలా ఆరోప‌ణ‌లు చేసి కోర్టుల‌కి వెళ్లారని, ఒక్క‌టి కూడా నిరూపించ‌లేక‌పోయారని, ఆరోప‌ణ‌లు చేయ‌డం కాదని, వాటిని నిరూపించాల‌ని అన్నారు. నాలుగు ఏళ్లుగా త‌న‌పై ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌సారిగా ఇప్పుడు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. తాను మూడు మాట‌ల్లో ఆరు అస‌త్యాలు మాట్లాడ‌తాన‌ని ప‌వ‌న్ అన్నారని, ఇది మంచి ప‌ద్ధ‌తి కాద‌ని అన్నారు. 

  • Loading...

More Telugu News