kiara advani: రెండో సినిమాకే భారీగా పారితోషికం పెంచేసిన కైరా అద్వాని

  • కైరా అద్వాని పైనే అందరి దృష్టి 
  • చరణ్ మూవీలోనూ ఆమెకే ఛాన్స్ 
  • పారితోషికంలో భారీ కనిపిస్తోన్న మార్పు

తెలుగు తెరకు 'భరత్ అనే నేను' సినిమా ద్వారా 'కైరా అద్వాని' పరిచయం కానుంది. తొలి సినిమానే మహేశ్ జోడీగా చేస్తుండటంతో, టాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టి సహజంగానే ఆమెపై పడింది. దాంతో తమ సినిమాల్లోకి ఆమెను తీసుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ క్రమంలో భారీగా ఆమె పెంచేసిన పారితోషికాన్ని ఇవ్వడానికి కూడా వాళ్లు ఎంత మాత్రం వెనకడుగు వేయడం లేదట.

 'భరత్ అనే నేను' సినిమా చేయడానికి ఆమె అందుకున్న పారితోషికం 50 లక్షలేనట. ఆ తరువాత చరణ్ సినిమా కోసం బోయపాటి టీమ్ ఆమెను సంప్రదించగా కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. 'భరత్ అనే నేను' తరువాత ఇక్కడ ఆమెకి పెరిగే క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఆ మొత్తం ఇవ్వడానికి ఈ సినిమా టీమ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ కొడితే ఇక్కడ కైరా డిమాండ్ ను తట్టుకోవడం కష్టమే.    

  • Loading...

More Telugu News