Chandrababu: పవన్ కల్యాణ్ అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది: చంద్రబాబు

  • ఎర్రచందనం అవినీతిపై పవన్ ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయి
  • ఎర్ర దొంగలపై తాము ఉక్కుపాదం మోపాం
  • తమిళనాడు తరహా రాజకీయాలను ఏపీలోకి తెచ్చేందుకు బీజేపీ యత్నిస్తోంది

తమిళనాడు తరహా రాజకీయాలను ఏపీలో కూడా నడిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని... అలాంటి నాటకాలు ఇక్కడ నడవబోవని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నిన్నటి దాకా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో డ్రామా ఆడించారని... ఇప్పుడు పవన్ ను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ఈ ఉదయం అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎర్రచందనంపై పవన్ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని... ఎర్రచందనం స్మగ్లింగ్ పై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, స్మగ్లింగ్ ను పూర్తిగా నియంత్రించిందని చెప్పారు. స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపినప్పుడు... జాతీయంగా, అంతర్జాతీయంగా తనపై మానవహక్కుల సంఘాలకు ఫిర్యాదులు పంపారని గుర్తు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న తనను అరెస్ట్ చేయించేందుకు కూడా ప్రయత్నించారని... అలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని చెప్పారు. అలాంటి ఎర్రచందనంపై పవన్ అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు టీడీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని పవన్ చెప్పడం కూడా పచ్చి అబద్ధమని మండిపడ్డారు. పవన్ నాటకాలకు స్క్రిప్ట్ లు ఎక్కడ నుంచి వచ్చాయో అందరికీ తెలుసని చెప్పారు.

  • Loading...

More Telugu News