TRS: నల్గొండకు పట్టిన శని నిన్నటితో వదిలింది : టీఆర్ఎస్ నేత భూపాల్ రెడ్డి

  • కోమటిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన భూపాల్ రెడ్డి
  • ఆయన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలే సిద్ధంగా ఉన్నారు
  • అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజున కోమటిరెడ్డి తాగొచ్చారు 
  • నల్గొండ టీఆర్ఎస్ ఇన్ చార్జి భూపాల్ రెడ్డి

కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నల్గొండ టీఆర్ఎస్ ఇన్ చార్జి భూపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నల్గొండకు పట్టిన ఇరవై ఏళ్ల శని నిన్నటితో వదిలిందని, హైకోర్టులో ఆయనపై ఉన్న కేసు చివరి దశలో ఉండగా, దేవుడు ఈరకంగా వేటు వేశాడని, కోమటిరెడ్డిని దెబ్బతీసేందుకు ఆయన పార్టీ కార్యకర్తలే సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజున కోమటిరెడ్డి తాగి వచ్చారని, జానారెడ్డిపై తూలిపడ్డారని ఆరోపించారు. కాగా, సీఎం కేసీఆర్ ను కలిసేందుకు అసెంబ్లీకి భూపాల్ రెడ్డి వెళ్లారు. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి శాసనసభ్యత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్గొండలో ఉపఎన్నిక జరిగే అవకాశమున్నట్టు సమాచారం. అక్కడి నుంచి భూపాల్ రెడ్డిని ఎన్నికల బరిలోకి దింపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.  

  • Loading...

More Telugu News