Jana Sena: విజయవాడ నుంచి జనసేన పార్టీ కార్యకర్తల పాదయాత్ర

  • 'జనసేన జాతీయ ఐక్యత' పేరుతో జనసేన నేతల పాదయాత్ర
  • విజయవాడ కనకదుర్గ వారధి నుంచి నంబూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వరకు
  • దాదాపు 14 కిలోమీటర్ల మేర కార్యకర్తల పాదయాత్ర

రాష్ట్రంలోని గుంటూరు జిల్లా, నంబూరులో మరికాసేపట్లో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు విజయవాడ నుంచి పాదయాత్రగా బయలుదేరారు. పార్టీ నేత ముత్యంశెట్టి కృష్ణారావు ఆధ్వర్యంలో 'జనసేన జాతీయ ఐక్యత' ఈ పాదయాత్రను చేపట్టారు. జాతీయ జెండా రంగులతో కూడిన దుస్తులు ధరించిన నేతలు, కార్యకర్తలు, యువత ఇందులో పాల్గొన్నారు. విజయవాడలోని కనకదుర్గ వారధి నుంచి నంబూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ సమీపంలో ఉన్న సభా వేదిక వరకు దాదాపు 14 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతుంది. మరోవైపు ఆంధ్రరాష్ట్రం నుంచే కాక తెలంగాణలోని పవన్ అభిమానులు కూడా ఈ సభలో పాల్గొనేందుకు భారీగా తరలి వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు.

  • Loading...

More Telugu News