Chandrababu: కాపులకు ఇచ్చిన హామీలపై చంద్రబాబుకు లేఖ రాసిన ముద్రగడ!

  • విభజన హామీలు అమలు చేయాలని చంద్రబాబు కోరుతున్నారు
  • మరి, మాకు ఇచ్చిన హామీల సంగతేంటి?
  •  హోదాపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు: ముద్రగడ  

రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరుతున్నారని, మరి, తమకు ఇచ్చిన హామీల సంగతేంటని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఈ మేరకు చంద్రబాబుకు ఆయన మరోమారు ఓ లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేకహోదాపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని, తప్పును సరిదిద్దుకోవడం కోసం ఆయన రోజుకో అబద్ధమాడుతున్నారని, ఓటుకు నోటు కేసుకు భయపడి విజయవాడకు పారిపోయి వచ్చింది నిజం కాదా? అని చంద్రబాబును ఆ లేఖలో  ముద్రగడ ప్రశ్నించారు. ఇప్పటికైనా మోసాలు ఆపి తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News