kalyan ram: 'ఎమ్మెల్యే' ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్

  • ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో 'ఎమ్మెల్యే'
  • కల్యాణ్ రామ్ జోడీగా కాజల్
  • ఈ నెల 17వ తేదీన ఆడియో రిలీజ్  

ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా 'ఎమ్మెల్యే' సినిమా రూపొందింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఈ నెల 17వ తేదీన కర్నూల్ లో జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రానున్నాడనేది తాజా సమాచారం. కల్యాణ్ రామ్ . . ఎన్టీఆర్ కి మధ్య గల అనుబంధం కారణంగా ఎన్టీఆర్ రావడం ఖాయమని చెబుతున్నారు.

 ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఇక బ్రహ్మానందం .. వెన్నెల కిషోర్ కాంబినేషన్లోని కామెడీ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. మార్చి 23వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చి పెడుతుందనే నమ్మకంతో కల్యాణ్ రామ్ వున్నాడు.     

  • Loading...

More Telugu News