nagarjuna: 'ఉగాది' రోజున రంగంలోకి దిగుతోన్న నాగ్ .. నాని

  • అశ్వనీదత్ నిర్మాతగా మల్టీస్టారర్ 
  • దర్శకుడిగా శ్రీరామ్ ఆదిత్య 
  • హీరోలుగా నాగ్ .. నాని        

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని కథానాయకులుగా ఒక మల్టీస్టారర్ రూపొందనుంది. అశ్వనీదత్ నిర్మాతగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది. తాజాగా ఈ సినిమాను గురించి అశ్వనీదత్ స్పందిస్తూ .. " 'ఉగాది' రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి" అన్నారు.

"దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య .. పాత్రలను మలిచినతీరు అద్భుతంగా వుంది. గతంలో మా సినిమాలన్నీ మ్యూజికల్ హిట్ అనిపించుకున్నాయి. అలాగే మణిశర్మ అందిస్తోన్న బాణీలు కూడా అందరి మనసులను దోచుకుంటాయి. ప్రస్తుతం మ్యూజిక్ సిటింగ్స్ అమెరికాలో జరుగుతున్నాయి. నాగార్జున .. నాని కాంబినేషన్లో చేస్తోన్న ఈ సినిమా, మా బ్యానర్ కి మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకముంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.    

  • Loading...

More Telugu News