charan: చిరూ ముఖ్య అతిథిగా 'రంగస్థలం' ప్రీ రిలీజ్ ఈవెంట్

  • చరణ్ హీరోగా 'రంగస్థలం'
  • ఈ నెల 18న ప్రీ రిలీజ్ ఈవెంట్
  • వేదికగా వైజాగ్ ఆర్కే బీచ్    

సుకుమార్ .. చరణ్ కాంబినేషన్లో రూపొందిన 'రంగస్థలం' సినిమా, ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 18వ తేదీన నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకి, వైజాగ్ .. ఆర్కే బీచ్ వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నాడనేది తాజా సమాచారం.

చాలామంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు తెలుస్తోంది.  లక్షమందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమానికి తరలిరానున్నట్టు చెబుతున్నారు. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఆయన లైవ్ పెర్ఫార్మెన్స్ ఈ వేడుకకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 

  • Loading...

More Telugu News