YSRCP: ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పడం వల్లే ఎక్కువ నష్టం జరుగుతోంది : ఎమ్మెల్యే బుగ్గన

  • రాష్ట్ర బడ్జెట్ లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి
  • పెట్టుబడుల సమ్మిట్, ఉద్యోగాల కల్పన అన్నీ మాయమాటలే
  • ఏపీ ప్రభుత్వం తీరు చూస్తుంటే విషయం తక్కువ, ప్రచారం ఎక్కువ అన్నట్టుగా ఉంది : బుగ్గన విమర్శలు

ఏపీ రాష్ట్ర బడ్జెట్ లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పడం వల్లే ఎక్కువ నష్టం జరుగుతోందని వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం తీరు చూస్తుంటే విషయం తక్కువ, ప్రచారం ఎక్కువ అన్నట్టుగా ఉందని, పెట్టుబడుల సమ్మిట్, ఉద్యోగాల కల్పన అన్నీ మాయమాటలేనని, రెవెన్యూ లోట్ లో సడన్ గా మిగులు ఎలా వచ్చిందని, కాగ్ లెక్కల ప్రకారం రెవెన్యూ రాబడిలో రూ.23 వేల కోట్లు లోటు ఉందని విమర్శించారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఏ రంగానికి ఆదాయం పెరగలేదని, అడ్డగోలు అనుమతులతో మద్యం ఆదాయం మాత్రమే రెట్టింపు చేశారని అన్నారు.  

  • Loading...

More Telugu News