charan: 'రంగస్థలం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీ సన్నాహాలు .. ప్రత్యేక ఆకర్షణలు ఇవే

  • చరణ్ .. సమంతల జోడీగా 'రంగస్థలం'
  • ఈ నెల 18వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • వేదికపై సందడి చేయనున్న దేవిశ్రీ            

మెగా అభిమానులంతా కూడా 'రంగస్థలం' కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రంగాన్ని సిద్ధం చేశారు. ఈ సినిమా రిలీజ్ కి ముందు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించడానికిగాను, ఈ సినిమా టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది.

 వైజాగ్ .. ఆర్కే బీచ్ లో ఈ నెల 18వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి భారీస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేదికపై దేవిశ్రీ ప్రసాద్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనుండటం ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఈ సినిమా 1985 కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో రూపొందింది కనుక, ఇదే వేదికపై బుర్రకథను .. తప్పెటలను .. చోడవరం డప్పు వాద్యాలను ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. ఇవి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చెబుతున్నారు.          

  • Loading...

More Telugu News