sharwanand: శర్వానంద్ కోసం క్యూ కడుతోన్న దర్శకులు

  • రెండు సినిమాలు చేస్తోన్న శర్వానంద్ 
  • మరో సినిమాను లైన్లో పెట్టే ప్రయత్నం 
  • కథలు వినిపిస్తోన్న యువ దర్శకులు 

కథా కథనాల విషయంలో శర్వానంద్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం హను రాఘవపూడితోను .. సుధీర్ వర్మతోను ఆయన సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే ఆయన ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై .. 'దండుపాళ్యం' దర్శకుడు శ్రీనివాస రాజుతో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే కథ విషయంలో శర్వానంద్ సంతృప్తి చెందకపోవడంతో, ఆ దర్శకుడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. హీరోకు .. నిర్మాతలకు మధ్య కుదిరిన డీల్ మాత్రం అలాగే వుంది. దాంతో శర్వానంద్ కి తగిన కథ తమ దగ్గర ఉందంటూ, యువ దర్శకులు చాలామంది వస్తున్నారట. ఈ నేపథ్యంలో వీలునుబట్టి శర్వానంద్ కథలు వింటున్నాడట. ఇక ఈ విషయంలో ఆయనను ఎవరు మెప్పిస్తారో .. ఈ బ్యానర్ పై సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి . 

  • Loading...

More Telugu News