ntr: రాజమౌళి సినిమా కోసం అమెరికా వెళ్లిన ఎన్టీఆర్ .. చరణ్!

  • రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ 
  • హీరోలుగా ఎన్టీఆర్ .. చరణ్ 
  • అమెరికాలో వర్క్ షాప్

ఎన్టీఆర్ .. చరణ్ .. చెరో బ్యాగ్ పట్టుకుని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. దాంతో ఇద్దరూ ఒకే చోటుకు వెళుతున్నారనే విషయం చూసేవారికి అర్థమైపోయింది. ఈ ఇద్దరూ కూడా అమెరికా వెళ్లారట .. అదీ రాజమౌళి సినిమా కోసం అనేది తాజా సమాచారం.

ఎన్టీఆర్ .. చరణ్ లతో రాజమౌళి ఒక మల్టీ స్టారర్ చేయనున్నారు. ఆ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ ను కూడా ఆయన నిర్వహించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వర్క్ షాప్ ను ఆయన నిర్వహించేది అమెరికాలోనట. అక్కడే ఎన్టీఆర్ .. చరణ్ లపై ఫోటో షూట్ ను కూడా ప్లాన్ చేశారట. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ సమయంలో ఈ ఫోటోలను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తి ఇక్కడి నుంచే మొదలైపోయిందని చెప్పాలి.  

  • Loading...

More Telugu News