ntr: ఎన్టీఆర్ జోడీగా పూజా హెగ్డే ఖరారైపోయింది

  • ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ
  • ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • సంగీత దర్శకుడిగా తమన్

'అజ్ఞాతవాసి' సినిమాతో పరాజయాన్ని అందుకున్న త్రివిక్రమ్, ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నారు. ఆయన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉండనుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా, ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ సమయం కోసం ఎన్టీఆర్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయంలో రోజుకో వార్త షికారు చేస్తోంది.

 ఈ క్రమంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా పూజా హెగ్డేను ఖరారు చేశారనేది తాజా సమాచారం. 'దువ్వాడ జగన్నాథం ' సినిమాలో గ్లామర్ పరంగా పూజా హెగ్డే మంచి మార్కులు కొట్టేసింది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'సాక్ష్యం' రెడీ అవుతోంది. ఇక 'రంగస్థలం'లో ఆమె చేసిన ఓ స్పెషల్ సాంగ్ ఆ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమాకి అనిరుథ్ సంగీతాన్ని అందించనున్నాడనే వార్త షికారు చేసింది .. కానీ, తమన్ ని తీసుకున్నారని తెలుస్తోంది. ఇక మహేశ్ నెక్స్ట్ మూవీలోనూ కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తుండటం విశేషం. 

  • Loading...

More Telugu News