Bihar: ప్రేమ పెళ్లి చేసుకున్నారని గుంజీల శిక్ష!

  • యువజంటపై పంచాయితీ పెద్దల దారుణం
  • ప్రేమ పెళ్లి చేసుకున్నారని వింత శిక్ష
  • కుటుంబ పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నా అంగీకరించని గ్రామ పెద్దలు
  • కేసును విచారిస్తున్న పోలీసులు

ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న కోపంతో ఓ యువజంటపై దారుణాతి దారుణంగా ప్రవర్తించారు ఓ గ్రామ పెద్దలు. బీహార్ లోని సుపౌల్ లో జరిగిన ఆ ఘటన వివరాల్లోకి వెళితే, నేపాల్ కు చెందిన మౌరానా అనే యువతి, బడ్ హరా సమీపంలోని తన తాతయ్య ఇంట్లో ఉంటుండగా, అదే ప్రాంతానికి చెందిన సంజీత్ కుమార్ ఆమెను ప్రేమించాడు. ఆమె కూడా అంగీకరించడంతో ఇద్దరూ వివాహం చేసుకుని ఇంటికి వచ్చారు.

వీరి పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలూ అంగీకరించారు కూడా. అయితే, గ్రామ పెద్దలు మాత్రం ససేమిరా అన్నారు. కొత్త దంపతుల చేత మోకాళ్లు అరిగేలా గుంజీలు తీయించారు. వారిచేత అక్కడి నేలపై ఉమ్మి వేయించారు. రూ. 11 వేల చొప్పున జరిమానా కట్టాలని తీర్పిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News