KCR: సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర
  • కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా
  • లేకపోతే, కేసీఆర్ తప్పుకుంటారా? : ఉత్తమ్ సవాల్

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని, లేకపోతే కేసీఆర్ తప్పుకుంటారా? అంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర నిర్వహించింది. ఈ యాత్రలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి కల్పిస్తామని, మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ మంజూరు చేస్తామని, సంగారెడ్డి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News