chiranjeevi: చిరూ .. బాలయ్యలతో మల్టీస్టారర్ చేయాలనుంది: 'అ!' మూవీ దర్శకుడు

  • 'అ!' సినిమాతో హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ
  • దర్శకుడిగా మంచి గుర్తింపు  
  • భారీ మల్టీ స్టారర్ మూవీపై దృష్టి

నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'అ!' చిత్రం ఇటీవలే థియేటర్స్ కి వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. విభిన్నమైన సినిమాగా .. ప్రయోగాత్మక చిత్రంగా ప్రశంసలు అందుకుంది. దర్శకుడిగా ప్రశాంత్ వర్మకు ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

దీంతో ఆయన తదుపరి సినిమా ఏ హీరోతో ఉంటుందా అనే ఆసక్తితో అంతా వున్నారు. ఆయన మాత్రం చిరంజీవి .. బాలకృష్ణలతో ఒక మల్టీస్టారర్ చేయాలని ఉందంటూ చెప్పడం విశేషం. ఈ ఇద్దరి హీరోలకు తగిన కథ తన దగ్గర ఉందనీ .. వాళ్లిద్దరిని ఓకే ఫ్రేమ్ లో చూపించాలని ఉందని అంటున్నాడు. గతంలో కొంతమంది దర్శకులు చిరంజీవి .. బాలకృష్ణల కాంబినేషన్లో సినిమా చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. అలాంటిది ప్రశాంత్ వర్మ ఈ విషయంలో ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి మరి.     

  • Loading...

More Telugu News