ntr: ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ టైటిల్ ఖరారైపోయినట్టే!

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 
  • టైటిల్ ను రిజిష్టర్ చేయించిన నిర్మాతలు 
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • దసరాకి రిలీజ్ చేయాలనే ఆలోచన

ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొత్తగా కనిపించడం కోసం ఎన్టీఆర్ గట్టిగా కసరత్తులు చేస్తున్నాడు. ఇక 'అజ్ఞాతవాసి ' ఫలితాన్ని దృష్టిలో పెట్టుకున్న త్రివిక్రమ్ .. ఈ సినిమా కథ .. కథనాల విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఎన్టీఆర్ సినిమా నుంచి అభిమానులు ఆశించే అంశాలను మిస్ చేయకుండగా .. తన మార్కు సినిమాగానే ఆయన ఈ కథలను మలుస్తున్నాడట.

మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాను నిర్మిస్తోన్న హారిక అండ్ హాసిని బ్యానర్ వారు తాజాగా 'ఆన్ సైలెంట్ మోడ్' అనే టైటిల్ ను రిజిష్టర్ చేయించారట. దాంతో ఈ టైటిల్ ఖరారైపోయినట్టేనని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.    

  • Loading...

More Telugu News