rajani: '2.0' రిలీజ్ విషయంలో జాప్యం ..కారణం?

  • పూర్తికాని '2.0' గ్రాఫిక్స్ పనులు
  • విడుదల తేదీ విషయంలో రాని క్లారిటీ
  • నిర్మాతల్లో పెరిగిన అసహనం  

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ .. ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రధారులుగా '2.0' రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమా, గ్రాఫిక్స్ కి సంబంధించిన పనులను పూర్తిచేసుకునే పనుల్లో వుంది. ఈ సినిమాకి గ్రాఫిక్స్ చేస్తోన్న సంస్థ దివాళా తీయడంతో, మిగతా వర్క్ ను ఇతర సంస్థలకి అప్పగించారు.

ఈ కారణంగా ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తుండటంతో నిర్మాతలు తీవ్రమైన అసహనానికి లోనయ్యారు. ఈ విధమైన ఆలస్యం కారణంగా తాము నష్టాల పాలవుతున్నామనీ .. రిలీజ్ డేట్ చెప్పమని శంకర్ ను నిర్మాతలు ఒత్తిడి చేశారట. దాంతో దర్శక నిర్మాతల మధ్య వాదన జరిగినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఇరువర్గాలకి చెందిన సన్నిహితులు రంగంలోకి దిగి ఈ విభేదాలకు చెక్ పెట్టాలనీ, రిలీజ్ డేట్ ఖరారు జరిగేలా చూడాలని ప్రయత్నిస్తున్నారట.  

  • Loading...

More Telugu News