Telangana: తెలంగాణ లో నేటి నుంచి 15వ బయో ఆసియా సదస్సు

  • హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు జరగనున్న సదస్సు
  • హాజరుకానున్న 60 దేశాల ప్రతినిధులు
  • బయో ఆసియా సదస్సుకు శాశ్వత వేదికగా ఉన్న హైదరాబాద్

నేటి నుంచి హైదరాబాద్ లో బయో ఆసియా -2018 సదస్సు  ప్రారంభం కానుంది. హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 60 దేశాల నుంచి రెండు వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ‘ఇదే సరైన సమయం’ అనే నినాదంతో జీవశాస్త్రాలు, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడుల సమీకరణలు లక్ష్యంగా ఈ సదస్సును తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది.

తెలంగాణ ఔషధనగరి, సుల్తాన్ పూర్ వైద్య పరికరాల ఉత్పత్తి పార్కులలో పెట్టబడుల నిమిత్తం పలు సంస్థలతో అవగాహనా ఒప్పందాలను ప్రభుత్వం చేసుకోనుంది. కాగా, బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ శాశ్వత వేదికగా ఉంది. పద్నాలుగు సంవత్సరాలుగా ఈ సదస్సును హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.  

  • Loading...

More Telugu News