lavanya: దాడికి గురైన విజయవాడ ఐటీ మహిళా ఉద్యోగిని లావణ్యను పరామర్శించిన స్టాలిన్

  • గత సోమవారం లావణ్యపై ముష్కరుల దాడి
  • అత్యాచార యత్నం
  • ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితురాలు

చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయవాడకు చెందిన మహిళా ఐటీ ఉద్యోగిని లావణ్య (30)ను డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పరామర్శించారు. నావలూరులోని ఓ ఐటీ కంపెనీలో ఆమె పనిచేస్తోంది. గత సోమవారం రాత్రి ఆమె ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై ఇనుప రాడ్లతో దాడి చేశారు.

ఆమె వద్ద ఉన్న నగలు, ఐఫోన్ ను దోచుకున్నారు. ఆ తర్వాత అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో, ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో లావణ్య కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వెళ్లిన స్టాలిన్... లావణ్యను పరామర్శించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లావణ్య కుటుంబసభ్యులను కూడా ఓదార్చారు.

  • Loading...

More Telugu News