India: భారత ఆర్మీపై మేమే దాడి చేశాం: లష్కరే తోయిబా ప్రకటన

  • సుంజువాన్‌లో ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదుల దాడి.. ఆరుగురి మృతి
  • ఈ దాడులు జైషే ఈ మొహమ్మద్ (జేఈఎమ్‌) చేసిందని నిర్ధారించుకున్న భారత్
  • మరోవైపు తాము చేశామంటూ లష్కరే తోయిబా ప్రకటన

జమ్ము కశ్మీర్‌లోని సుంజువాన్‌లో ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు యూరీ తరహా దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ దాడి తామే చేశామని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రకటన చేసింది. అంతేగాక, ఈ రోజు ఉదయం శ్రీనగర్‌లోని కరణ్‌ నగర్‌లో సీఆర్పీఎఫ్‌ శిబిరంపై సైతం ఉగ్రదాడికి ప్రయత్నం జరగగా, వెంటనే భారత భదత్రా సిబ్బంది ప్రతిఘటించింది. ఈ దాడికి కూడా తామే బాధ్యులమని లష్కరే తోయిబా చెప్పింది.

అయితే, ఈ దాడులు జైషే ఈ మొహమ్మద్ (జేఈఎమ్‌) చేసిందన్న విషయాన్ని భారత ఆర్మీ నిర్ధారించుకున్న విషయం తెలిసిందే. కానీ, లష్కరే తోయిబా తామే దాడి చేశామంటూ ఇటువంటి ప్రకటన చేయడం గమనార్హం. ఈ దాడుల్లో ఐదుగురు జవాన్లతో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. భారత భద్రతాసిబ్బంది చేతిలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. 

  • Loading...

More Telugu News