Jagan: ఇకపై ఎలా ముందుకు వెళదాం?.. చర్చించడానికి తమ పార్టీ నేతలతో భేటీ కానున్న జగన్

  • ప్రస్తుతం నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దకొండూరులో జగన్
  • ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ రోజు సాయంత్రం చర్చ
  • కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై పరిశీలన

ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం తమ పార్టీ పార్లమెంటు సభ్యులు, నేతలతో భేటీ కానున్నారు. ప్రస్తుతం జగన్ నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దకొండూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి ఏమీ చేయకపోయినా, ఏదో సాధించేసినట్టు టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ తీరుపై భేటీలో చర్చ జరగనుంది.

అలాగే, ప్రత్యేక హోదా అంశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించటంపై కూడా ఈ సమావేశంలో జగన్ తమ పార్టీ నేతలతో చర్చిస్తారు.  

  • Loading...

More Telugu News