Shalini: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • గాయనిగా మారిన 'అర్జున్ రెడ్డి' నాయిక
  • క్లైమాక్స్ లో పడిన 'నా పేరు సూర్య'
  • అమెరికాలో మొదలవుతున్న రవితేజ సినిమా 
  • టాలీవుడ్ కి 'ఎయిర్ టెల్' భామ

*  గత సంవత్సరం వచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక శాలినీ పాండే తాజాగా గాయనిగా కూడా మారింది. పాప్యులర్ రాక్ బ్యాండ్ 'లగోరి'తో కలసి ఓ మ్యూజిక్ వీడియో ఆల్బం చేసింది. ఇందులో 'నా ప్రాణమే..' అంటూ సాగే పాటను శాలిని పాడింది. వేలెంటైన్స్ డే సందర్భంగా దీనిని ఈ 14న రిలీజ్ చేస్తారు.    
*  అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'నా పేరు సూర్య' చిత్రం క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ నేటి నుంచి హైదరాబాదులో భారీ ఎత్తున జరుగుతుంది. ఇందులో అనూ ఇమ్మానుయేల్ కథానాయికగా నటిస్తోంది.
*  రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందే 'అమర్ అక్బర్ ఆంథోని' చిత్రం షూటింగ్ ఈ నెల 19 నుంచి అమెరికాలో జరుగుతుంది. ఇందుకోసం ప్రధాన సాంకేతక బృందం ఇప్పటికే అమెరికా చేరుకుంది. రవితేజ మాత్రం ఏప్రిల్ లో ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతాడు. అంతవరకూ హీరో లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారు.
*  ఎయిర్ టెల్ వాణిజ్య ప్రకటనలో కనిపించే శశ చెత్రి టాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తోంది. 'వినాయకుడు' ఫేం సాయికిరణ్ అడవి దర్శకత్వం వహించే తదుపరి చిత్రంలో ఈ చిన్నది కథానాయికగా ఎంపిక అయింది.      

  • Loading...

More Telugu News