Pawan Kalyan: ప్రభుత్వాలెప్పుడూ అబద్ధాలాడవు.. నిజాలు దాస్తాయి!: ఉండవల్లి అరుణ్ కుమార్

  • ఈ భేటీలో రాజకీయాల గురించి పవన్ మాట్లాడలేదు  
  • చాలా మంది మేధావులను పవన్ సంప్రదిస్తున్నారు
  • నిజమైన రాజకీయాలను ఆయన ప్రారంభించారేమోననిపించింది
  • పవన్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వాలు సహకరించాలి 

ఏ ప్రభుత్వమూ అబద్ధాలాడదు కానీ, నిజాలు మాత్రం దాస్తుందని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ చమత్కరించారు. హైదరాబాద్, ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్- ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ ముగిసింది. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ భేటీలో పవన్ తన మొదటి ప్రశ్నతోనే ఆకట్టుకున్నారని అన్నారు. రాజకీయ నాయకులు అబద్ధాలాడతారు, ప్రభుత్వాలు మాత్రం ఆడవని అభిప్రాయపడ్డారు.

ఈ భేటీలో పవన్ రాజకీయాల గురించి మాట్లాడలేదని, సామాన్య పౌరుడిలా ప్రశ్నలు వేశారని, అదే తనను ఆకట్టుకుందని అన్నారు. పవన్ కల్యాణ్ చాలా మంది మేధావులతో సంప్రదింపులు జరుపుతున్నారని, నిజమైన రాజకీయాలను ఆయన ప్రారంభించారేమోనని తనకు అనిపించిందని చెప్పారు. ఈ ప్రయత్నంలో పవన్ కచ్చితంగా విజయం సాధిస్తారని ఉండవల్లి అన్నారు.

 ప్రస్తుతం ఏపీ గడ్డు పరిస్థితుల్లో ఉందని, వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, పవన్ కల్యాణ్ లక్ష్యం అభినందనీయమని ఈ సందర్భంగా ప్రశంసించారు. పవన్ కల్యాణ్ వల్లే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఏపీకి న్యాయం జరగాలని పవన్ చేస్తున్న ప్రయత్నాలకు ఏపీ, కేంద్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు.

  • Loading...

More Telugu News