Telangana: రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు రేపు సెలవు లేదు: తెలంగాణ ప్రభుత్వం

  • రేపు ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి
  • విద్యా సంస్థలకూ రేపు సెలవు లేదు
  • జనవరి 1న సెలవు కనుక ఈ నిర్ణయం తీసుకున్నాం: తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలు రేపు యథావిధిగా పని చేయనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. రేపు రెండో శనివారం (సెకండ్ సాటర్ డే) అయినప్పటికీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేయాలని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 1న ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇచ్చిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులందరూ రేపు తమ విధులకు హాజరుకావాలని. విద్యా సంస్థలు కూడా రేపు పని చేస్తాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News