Cricket: విరాట్ కోహ్లీ వీరబాదుడు.. దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 304 పరుగులు!

  • కోహ్లీ 160 (నాటౌట్), శిఖర్ ధావన్ 76 పరుగులు
  • దక్షిణాఫ్రికా బౌలర్లలో డుమినీకి 2 వికెట్లు 
  • మోరీస్, రబాడా, ఆండిలె, ఇమ్రాన్ తహీర్‌లకు చెరో వికెట్  

కేప్‌టౌన్‌లో జరుగుతోన్న భారత్, దక్షిణాఫ్రికా మూడో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరబాదుడు బాదడంతో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ 0, శిఖర్ ధావన్ 76, అజింక్యా రహానె 11, హార్దిక్ పాండ్యా 14, విరాట్ కోహ్లీ 160 (నాటౌట్), ధోనీ 10, జాధవ్ 1, భువనేశ్వర్ కుమార్ 16 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో దక్షిణాఫ్రికా ముందు టీమిండియా 304 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో డుమినీ 2 వికెట్లు తీయగా మోరీస్, రబాడా, ఆండిలె, ఇమ్రాన్ తహీర్‌లకు చెరో వికెట్ దక్కాయి. 

  • Loading...

More Telugu News