India: కేప్‌టౌన్‌ వన్డే: సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ

  • టీమిండియా స్కోరు 223/4 (40 ఓవర్లకి)
  • క్రీజులో కోహ్లీ (108), ధోనీ (9)
  • దక్షిణాఫ్రికా బౌలర్లలో డుమినీకి 2 వికెట్లు.. మోరీస్, రబాడాలకి చెరో వికెట్

కేప్‌టౌన్‌లో జరుగుతోన్న భారత్, దక్షిణాఫ్రికా మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాట్స్ మెన్ వరుసగా అవుట్ అవుతున్నప్పటికీ కోహ్లీ మాత్రం ఫోర్లు, సిక్సర్లు కొడుతూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 34వ సెంచరీ.

కాగా, టీమిండియా బ్యాట్స్ మెన్‌లో రోహిత్ శర్మ 0, శిఖర్ ధావన్ 76, అజింక్యా రహానె 11, హార్దిక్ పాండ్యా 14 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 108, ధోనీ 9 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 223/4 (40 ఓవర్లకి) గా ఉంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో డుమినీ 2 వికెట్లు తీయగా మోరీస్, రబాడా చెరో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News