vinayak: 'అదుర్స్'కి సీక్వెల్ తప్పకుండా చేస్తాను: వినాయక్

  • 'ఇంటిలిజెంట్' ప్రమోషన్స్ లో వినాయక్ 
  • తాజా ఇంటర్వ్యూలో 'అదుర్స్' సీక్వెల్ ప్రస్తావన
  • ఈ విషయంపై స్పందించిన వినాయక్  

వినాయక్ తాజా చిత్రంగా ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఇంటిలిజెంట్' రెడీ అవుతోంది. సాయిధరమ్ తేజ్ .. లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ తో వినాయక్ బిజీగా వున్నారు. ఆయన తాజా ఇంటర్వ్యూలో 'అదుర్స్' సినిమా సీక్వెల్ ప్రస్తావన వచ్చింది.

అప్పుడు ఆయన స్పందిస్తూ "ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని చాలాకాలం క్రితమే అనుకున్నాం. కొన్ని కారణాల వలన కుదరలేదు. కానీ త్వరలోనే తప్పకుండా ఈ సినిమాకి సీక్వెల్ చేస్తాను" అని ఆయన అన్నారు. ఇటు వినాయక్ కెరియర్లోను .. అటు ఎన్టీఆర్ కెరియర్లోను 'అదుర్స్' సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నూటికి నూరు మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేస్తానని వినాయక్ చెప్పడం .. ఎన్టీఆర్ అభిమానులకి ఆనందాన్ని కలిగించే విషయమేనని చెప్పాలి. 

  • Loading...

More Telugu News