Asaduddin Owaisi: భారత ముస్లింను 'పాకిస్థానీ' అని సంబోధిస్తే మూడేళ్లు జైల్లో పెట్టాలి: అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్

  • ఈ మేరకు చట్టం చేయాలి
  • లోక్ సభలో డిమాండ్
  • మోదీ ప్రభుత్వం ఆ పనిచేయదని వ్యాఖ్య

భారత ముస్లింను పాకిస్థానీ అని ఎవరైనా అంటే వారిని శిక్షించేలా చట్టాన్ని తీసుకురావాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఎవరైనా ఇలా మాట్లాడితే వారికి మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించేలా చట్టం ఉండాలన్నారు. ఈ మేరకు అసదుద్దీన్ లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే చర్చలో మాట్లాడారు.

అయితే, ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఈ తరహా బిల్లును పార్లమెంటుకు తీసుకురాలేదన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లును మహిళల వ్యతిరేకమైనదిగా ఆయన అభివర్ణించారు. మొహమ్మద్ అలీ జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని భారత్ లోని ముస్లింలు తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News