rajnath singh: త్వరలోనే రాజకీయ పరమైన నిర్ణయాలు: టీడీపీ ఎంపీలతో రాజ్‌నాథ్ సింగ్

  • బడ్జెట్‌పై ఏపీకి అన్యాయం నేపథ్యంలో రాజ్‌నాథ్‌తో టీడీపీ ఎంపీల భేటీ
  • టీడీపీ నేతలతో కలిసి విస్తృతంగా చర్చించి ఓ నిర్ణయానికి వస్తాం-రాజ్‌నాథ్
  • టీడీపీ నేతల నిరసనల అంశాన్ని అమిత్ షా నిశితంగా పరిశీలిస్తున్నారు
  • ఏపీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలకు త్వరలోనే పరిష్కారం 

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని మండిపడుతోన్న టీడీపీ ఎంపీలు ఈ రోజు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం అయ్యారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను వారు రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ కీలక సూచనలు చేసినట్లు సమాచారం.

త్వరలోనే రాజకీయపరమైన పలు నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఏపీ టీడీపీ నేతలతో కలిసి విస్తృతంగా చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని అన్నారు. టీడీపీ నేతల నిరసనల అంశాన్ని తమ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నిశితంగా పరిశీలిస్తున్నారని అన్నట్లు తెలిసింది. ఏపీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. 

  • Loading...

More Telugu News