south africa: భారత్‌తో వన్డే సిరీస్‌ నుంచి వైదొలగిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్

  • భారత్‌తో వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా మర్‌క్రమ్ ఎంపిక
  • డర్బన్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో డుప్లెసిస్ చేతి వేలికి గాయం
  • రేపు రెండో వన్డే

డ‌ర్బ‌న్ వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డేలో టీమిండియా చేతిలో ద‌క్షిణాఫ్రికా ఓడిన విష‌యం తెలిసిందే. కాగా, ద‌క్షిణాఫ్రికాకు మ‌రో దెబ్బ త‌గిలింది. మొద‌టి వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌ చేతి వేలికి గాయం అయింది. గాయం మాన‌క‌క‌పోవ‌డంతో ఆయ‌న ఈ సిరీస్ నుంచి వైదొలిగారు. దీంతో భారత్‌తో వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా మర్‌క్రమ్ ను ఎంపిక చేయ‌నున్నట్లు తెలిసింది. కాగా, భార‌త్, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య రేపు మ‌ధ్యాహ్నం 1.30 గంటలకు రెండో వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత్ వన్డే సిరీస్‌లోనైనా గెలవాలని పట్టుదలతో ఉంది.    

  • Loading...

More Telugu News