suicide: కాలేజీలో ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

  • కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లులో ఘటన
  • విజయవాడ ప్రభుత్వాసుపత్రికి విద్యార్థిని మృతదేహం తరలింపు
  • ఆత్మహత్యపై ఆరా తీస్తోన్న పోలీసులు 

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లు చైతన్య జూనియర్ కాలేజీలో కలకలం చెలరేగింది. కళాశాల క్యాంపస్‌లో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. విద్యార్థిని మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చదువు ఒత్తిడే విద్యార్థిని ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. విద్యార్థిని ఆత్మహత్యపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.    

  • Loading...

More Telugu News