rajani: '2.0' టీజర్ రిలీజ్ కి ముఖ్య అతిథులుగా చిరూతో పాటు మలయాళ స్టార్ హీరోలు

  • హైదరాబద్ లో .. '2.0' ఫంక్షన్ 
  • ఈ నెల చివరిలో జరిపే అవకాశం 
  • ముఖ్య అతిథులుగా స్టార్ హీరోలు

ప్రస్తుతం శంకర్ '2.0' సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ పర్యవేక్షణలో బిజీగా వున్నారు. గ్రాఫిక్స్ పనులు పూర్తయిన తరువాతనే ఆయన రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకను దుబాయ్ లో గ్రాండ్ గా నిర్వహించిన టీమ్, హైదరాబాద్ లో టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఈ టీజర్ తో భారీగా అంచనాలు పెంచేయాలనే ఆలోచనలో వున్నారు. హైదరాబాద్ లో భారీ స్థాయిలో ఓ వేడుకను నిర్వహించి .. ఆ వేదికపై టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. అలాగే మలయాళ సూపర్ స్టార్స్ మోహన్ లాల్ .. మమ్ముట్టిలను కూడా ఆహ్వానించారు. ఈ నెల చివరిలో ఈ వేడుకను జరపనున్నారు. భారీ తారాగణంతో .. భారీ బడ్జెట్ తో పాటు భారీ వేడుకలు కూడా నిర్వహిస్తూ వుండటంతో, ఈ సినిమాపై అందరిలోనూ ఆత్రుత పెరిగిపోతోంది.     

  • Loading...

More Telugu News