Telangana: తెలంగాణ రాష్ట్ర 'ఫూలే విదేశీ విద్య' ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు

  • ఈ నెల 15 వ‌ర‌కు పొడిగింపు
  • మ‌రిన్ని వివ‌రాలకు సంబంధిత అధికారులు లేదా వెబ్ సైట్ ను సంప్రదించాలి
  • బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామ‌న్న‌

తెలంగాణలో బీసీ వ‌ర్గాలకు చెందిన‌ విద్యార్థులకు ఉద్దేశించిన పథకం మ‌హాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్య నిధి. ఈ పథకం కింద ద‌ర‌ఖాస్తు చేసుకునే గ‌డువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్టు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామ‌న్నతెలిపారు. ఈ అవ‌కాశాన్ని బీసీ విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

వాస్త‌వానికి విదేశీ విద్య నిధి ద‌ర‌ఖాస్తు గ‌డువు తేదీ జ‌న‌వ‌రి 31తో ముగిసింది కానీ, వివిధ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన విజ్ఞ‌ప్తుల మేర‌కు ఆ తేదీని పొడిగించిన‌ట్లు జోగు రామ‌న్న తెలిపారు. మ‌రిన్ని వివ‌రాల కోసం జిల్లా, డివిజ‌న్ బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారుల‌ను సంప్ర‌దించాల‌ని, బీసీ అభ్య‌ర్థులు ఈపాస్ వెబ్‌సైట్‌లో హెచ్‌టీపీపీ //తెలంగాణ ఈపాస్ సీజీజీ.జీవోవీ.ఇన్ ద్వారా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చ‌ని సూచించారు. 

  • Loading...

More Telugu News