KTR: అలా అయితే ప్రతి ఒక్కరూ గడ్డాలు పెంచుతారు!: ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్

  • టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా
  • వచ్చే ఎన్నికల్లో విజయం మాదే
  • కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఉత్తమ్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా?: కేటీఆర్

'నడిగడ్డ సాక్షిగా చెబుతున్నా.. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా'నని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ లో ఈరోజు పర్యటించిన కేటీఆర్ మాట్లాడుతూ, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం.. అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో 70 సీట్లు గెలుస్తామని చెబుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని కేటీఆర్ సవాల్ విసిరారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తియ్యనని ఉత్తమ్ అన్నారని, గడ్డం పెంచుకున్న ప్రతిఒక్కడూ గబ్బర్ సింగ్ అయిపోతాడా? గడ్డాలు పెంచుకుంటే అధికారం వస్తుందనుకుంటే, ప్రతి ఒక్కరూ గడ్డాలు పెంచుకుంటారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

  • Loading...

More Telugu News