Uttam Kumar Reddy: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి కౌంటర్ ఇచ్చి.. ఎద్దేవా చేసిన మంత్రి కేటీఆర్

  • ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన కేటీఆర్‌
  • పిలవకుండానే వెళ్లారని విమర్శించిన ఉత్తమ్ కుమార్‌ రెడ్డి
  • తనను పిలిచారంటూ పలు కాపీలు పోస్ట్ చేసిన కేటీఆర్‌
  • తాను 'పప్పూ'ను కాదంటూ చురక.. ఆగ్రహం

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే, సదస్సుకు వెళ్లే వారు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లుగానే మంత్రి కేటీఆర్ కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఆ స‌ద‌స్సుకు వెళ్లారని, అంతేకానీ, ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా ఆహ్వానం అందలేద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఈ రోజు ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ... తనకు పంపిన ఆహ్వానానికి సంబంధించిన ఈ-ఇన్విటేషన్‌, ఈమెయిల్‌ కాపీలు ఇవేనంటూ ప‌లు ఫొటోల‌ను కేటీఆర్ పోస్ట్ చేశారు.

మేధో దివాళాకోరుతనానికి ప్రతీక అయిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, ఆయన కోసం ఈ ఆహ్వానం కాపీలను వెల్లడిస్తున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే, ‘ఉత్తమ్‌గారూ నేను ‘పప్పూ’ను కాదు.. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు హుందాగా స‌రి చేసుకుంటారని ఆశిస్తున్నాన‌ని ఎద్దేవా చేశారు. 

  • Loading...

More Telugu News