chaitu: త్వరలో 'సవ్యసాచి' అమెరికా ప్రయాణం

  • చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి'
  • చైతూ జోడీగా నిధి అగర్వాల్ 
  • కీలకమైన పాత్రలో మాధవన్  

తనకి 'ప్రేమమ్' వంటి సూపర్ హిట్ ను ఇచ్చిన చందూ మొండేటితో చైతూ 'సవ్యసాచి' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. మార్చి నుంచి అక్కడ కొన్ని వారాల పాటు చిత్రీకరణ జరపనున్నారు. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ తెరకెక్కించనున్నారు.

 చైతూ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో, నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో, తమిళ స్టార్ హీరో మాధవన్ ఒక కీలకమైన పాత్రను చేస్తున్నారు. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో చైతూ వున్నాడు. ఈ సినిమాతో పాటు ఆయన మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' చేస్తోన్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News