Rashi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • ఇక్కడే బాగుందంటున్న ముద్దుగుమ్మ 
  • 'జీఎస్టీ'కి వర్మ సీక్వెల్ తీస్తాడట!  
  • 32 భాషల్లో విక్రం 'కర్ణ' నిర్మాణం 
  • క్రాంతిమాధవ్ తో విజయ్ దేవరకొండ సినిమా

*  బాలీవుడ్ కి వెళ్లే ఉద్దేశం ప్రస్తుతానికైతే లేదని చెబుతోంది ముద్దుగుమ్మ రాశిఖన్నా. "హిందీ సినిమాల ఆఫర్ల కోసం నేనైతే ప్రయత్నాలు చేయడం లేదు. వస్తే అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి నాకు ఇక్కడే బాగుంది. ఇక్కడే మరిన్ని సినిమాలు చేస్తాను" అని చెప్పింది.
*  ఇటీవల తాను రూపొందించిన అడల్ట్ సినిమా 'జీఎస్టీ'కి త్వరలో సీక్వెల్ చేయనున్నట్టు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. జీఎస్టీకి మంచి రెస్పాన్స్ వచ్చిందని, అందుకే దీనికి సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నానని వర్మ చెప్పారు.
*  ప్రముఖ నటుడు విక్రం హీరోగా 'మహావీర్ కర్ణ' పేరిట భారత కథను 300 కోట్ల బడ్జెట్టుతో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆర్.ఎస్. విమల్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని మొత్తం 32 భాషల్లోకి డబ్ చేస్తారట. ఈ ఏడాది అక్టోబర్లో ఇది సెట్స్ కి వెళుతుంది.
*  'అర్జున్ రెడ్డి' ఫేం విజయ్ దేవరకొండ హీరోగా ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నుంచి జరుగుతుంది.     

  • Loading...

More Telugu News