ipl: ఐపీఎల్ లో ఎట్టకేలకు అమ్ముడుపోయిన గేల్!

  • అమ్ముడుపోని క్రికెటర్లకు చివర్లో మరోమారు నిర్వహించిన వేలం
  • కనీస ధరకే అమ్ముడుపోయిన గేల్
  • రూ.2 కోట్లకే సొంతం చేసుకున్న కింగ్స్ పంజాబ్  

ఐపీఎల్ వేలంలో క్రిస్ గేల్ ఎట్టకేలకు అమ్ముడుపోయాడు. తొలిరోజు వేలంలో అమ్ముడు పోని గేల్, ఈరోజు జరిగిన వేలంలో అవకాశం కొట్టేశాడు. అయితే, ఈరోజు అన్ సోల్డ్ వేలం పాటలో భాగంగా తొలుత గేల్ ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దాంతో, అమ్ముడుపోని క్రికెటర్లకు చివర్లో మరోమారు వేలం నిర్వహించగా, రూ.2 కోట్లకే గేల్ ను కింగ్స్ పంజాబ్ కొనుగోలు చేసింది. గేల్ కు ఉన్న కనీసధరకే అతన్ని కింగ్స్ పంజాబ్ సొంతం చేసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News