Ram Nath Kovind: అశోక చక్ర పురస్కారం అందజేస్తూ రాష్ట్రపతి కోవింద్ భావోద్వేగం!

  • పురస్కారాన్ని అందుకున్న కార్పొరల్ జ్యోతి ప్రకాశ్ కుటుంబం
  • జ్యోతి ప్రకాశ్ భార్య, తల్లికి అవార్డు అందజేసిన రాష్ట్రపతి
  • చెమ్మగిల్లిన కోవింద్ కళ్లు .. కర్చీఫ్ తో తుడుచుకున్న వైనం!

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఒకింత ఉద్వేగం చెందారు. తాను ధరించిన కళ్లజోడు తీసి చెమ్మగిల్లిన తన కళ్లను కర్చీఫ్ తో తుడుచుకున్న దృశ్యం ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కనిపించింది. అత్యున్నత సేవా పురస్కారమైన అశోకచక్ర అవార్డును ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని ప్రత్యేక ఫోర్స్ గరుడ్ కమాండోకు చెందిన కార్పొరల్ జ్యోతి ప్రకాశ్ నిరాలా కుటుంబానికి అందజేసే సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జ్యోతి ప్రకాశ్ నిరాలా భార్య సుష్మ, ఆయన తల్లి మాల్తీ దేవికి ఈ పురస్కారాన్ని అందజేసే సమయంలో రామ్ నాథ్ కోవింద్ కళ్లు చెమ్మగిల్లాయి.

కాగా, జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు టెర్రరిస్టులను జ్యోతి ప్రకాశ్ నిరాలా హతమార్చారు. పరస్పరం కాల్పుల నేపథ్యంలో జ్యోతి ప్రకాశ్ నిరాలా శరీరంలో బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయకుండా ధైర్యసాహసాలను ప్రదర్శించి పోరాడి భద్రతా దళాలకు విజయాన్ని అందించారు. వీరమరణం పొందిన జ్యోతి ప్రకాశ్ నిరాలాకు అశోకచక్ర  అత్యున్నత సేవా పురస్కారాన్ని ప్రకటించింది. బీహార్ కు చెందిన జ్యోతి ప్రకాశ్ నిరాలా బీహార్ కు చెందిన వ్యక్తి. 2005లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి ఆయన ప్రవేశించారు.

  • Loading...

More Telugu News